అప్పుడు అన్నతో.. ఇప్పుడు తమ్ముడితో.. సెట్టైన క్రేజీ కాంబో?

అప్పుడు అన్నతో.. ఇప్పుడు తమ్ముడితో.. సెట్టైన క్రేజీ కాంబో?

ఏదైనా ఒక భాషలో ఒక సినిమా హిట్ అయ్యింది అంటే ఆ సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం మామూలే. అందులో కొన్ని హిట్స్ కాగా.. మరికొన్ని ఫ్లాప్స్ గా నిలిచాయి. ఇక తాజాగా ఇలాంటి ఒక రీమేక్ గురించే టాలీవుడ్ లో న్యూస్ వైరల్ అవుతోంది. అందుకోసం ఒక క్రేజీ కాంబో కూడా సెట్ అయ్యింది. ఆ కాంబో మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan), మాస్ మహారాజ్ రవితేజ(Raviteja). ఈ కాంబోలో సినిమా అనగానే ఫ్యాన్స్ ఎగిరిగంతేయడం ఖాయం. 

ఇక అసలు విషయానికి వస్తే.. ఆ మధ్య పవన్ కళ్యాణ్ దర్శకుడు సురేందర్ రెడ్డి(Surendar reddy)తో ఓ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్న విషయం తెల్సిందే. రామ్ తళ్లూరు(Ram talluri) నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు మేకర్స్. దాదాపు సంవత్సరం క్రితం ఈ అనౌన్స్మెంట్ వచ్చింది కానీ ఆ ప్రాజెక్టుపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. 

అయితే తాజాగా మరోసారి ఈ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. అదేంటంటే.. ఈ ప్రాజెక్టు కోసం తమిళంలో సూపర్ హిట్ ఐన విక్రమ్ వేద సినిమాను రీమేక్ చేయనున్నారట. అంతేకాదు ఇందులో మరోముఖ్య పాత్ర కోసం రవితేజను ఫైనల్ చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ కాంబోలో సినిమా అంటే అది మాస్ కా బాప్ ల ఉంటుందని, ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్ని బద్దలవడం ఖాయం అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.