ఓటర్​లిస్టులో అవకతవకలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే: పాయల్ శంకర్​

ఓటర్​లిస్టులో అవకతవకలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే:  పాయల్ శంకర్​

ఆదిలాబాద్​ టౌన్​, వెలుగు: ఆదిలాబాద్​ ఎమ్మెల్యే జోగు రామన్న ఓటర్​ లిస్టులో అవకతవకలకు పాల్పడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్​శంకర్​ ఆరోపించారు. గురువారం ఆయన కలెక్టర్​రాహుల్​ రాజ్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జాతీయ ఎన్నికల కమిషన్ కార్యాలయానికి లిఖిత పూర్వకంగా కంప్లైంట్ చేశారు. బీజేపీ అనుకూల వర్గాల పేర్లను ఓటరు లిస్ట్​లో నుంచి డిలీట్​ చేపిస్తున్నారని, దొంగ ఓట్లను జొప్పిస్తున్నారని ఆరోపించారు. 

2018 ఎన్నికల్లో బీజేపీకి అనుకూలమైన చోట్ల దాదాపు 20 వేల ఓట్లను గల్లంతు చేశారని పేర్కొన్నారు. న్యాయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఎమ్మెల్యే అడ్డదారులు తొక్కుతున్నారని ఫైర్​అయ్యారు. చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. జిల్లా నాయకులు ముకుంద్, బుమా రెడ్డి, కేశవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.