హామీల అమలులో బీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్ : పాయం వెంకటేశ్వర్లు

హామీల అమలులో బీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్ : పాయం వెంకటేశ్వర్లు

గుండాల/ఆళ్లపల్లి, వెలుగు : ఇచ్చిన హామీలు అమలు చేయడంలో బీఆర్​ఎస్​ సర్కార్ ఫెయిల్ అయిందని కాంగ్రెస్ పినపాక అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం ఆళ్లపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు.

ఇందిరమ్మ రాజ్యం రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్​తోనే సాధ్యమని, భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఆయం రామ నరసయ్య, పడిగ సమ్మయ్య, గౌరబోయిన సుబ్బారావు, అతహర్, రహీం, మిత్రపక్ష నాయకులు రేస్ ఎల్లయ్య , రహీం పాల్గొన్నారు. 

ALSO READ : రాజకీయ నిరుద్యోగులే మార్పు కోరుకుంటున్నారు : కేటీఆర్