PBKS vs RCB: టాస్ గెలిచిన పంజాబ్.. ఓడిన జట్టు అస్సామే

PBKS vs RCB: టాస్ గెలిచిన పంజాబ్.. ఓడిన జట్టు అస్సామే

ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్ చివరి దశకు చేరుకుంది. నెల రోజుల‌కు పైగా ఆభిమానుల‌ను అల‌రిస్తున్న ఈ మెగా టోర్నీ మ‌రో రెండు వారాలే మిగిలివున్నాయి. అన్ని జట్లు 10కిపైగా మ్యాచ్‌లు ఆడగా.. ప్లే ఆఫ్స్ రేసు ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఇప్పటికే కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (16 పాయింట్లు), రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (16 పాయింట్లు) తమ బెర్త్‌లు ఖరారు చేసుకోగా.. మిగిలిన‌ రెండు స్థానాల కోసం నాలుగు జ‌ట్ల మ‌ధ్య గ‌ట్టి పోటీ నెల‌కొంది.

ఈ క్రమంలో గురువారం(మే 09) ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కింగ్స్ సారథి సామ్ కరన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బెంగళూరు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుంది.

తుది జట్లు

పంజాబ్: జానీ బెయిర్‌స్టో(వికెట్ కీపర్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, రిలీ రోసౌ, శశాంక్ సింగ్, సామ్ కర్రాన్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, అశుతోష్ శర్మ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, విధ్వత్ కవరప్ప.

బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటిదార్, మహిపాల్ లోమ్రోర్, కెమెరూన్ గ్రీన్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్.