PBKS vs RR: అదే ఆట.. అదే ఫలితం.. పంజాబ్ టాఫార్డర్ మరోసారి విఫలం 

PBKS vs RR: అదే ఆట.. అదే ఫలితం.. పంజాబ్ టాఫార్డర్ మరోసారి విఫలం 

ముల్లన్ పూర్ వేదికగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ టాఫార్డర్ బ్యాటర్లు మరోసారి విఫలమయ్యారు. రాయల్స్ బౌలర్లను ఎదుర్కోలేక పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులకే పరిమితమైంది. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన‌ పంజాబ్ కింగ్స్‌ను అవేశ్ ఖాన్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఓ చక్కని బంతితో అధ‌ర్వ తైడే(15)ని పెవిలియన్ చేర్చాడు. కొద్దిసేపటికే చాహ‌ల్.. ప్ర‌భ్‌సిమ్రాన్ సింగ్(10)ను వెన‌క్కి పంపాడు. ఆపై కేశ‌వ్ మ‌హ‌రాజ్.. జానీ బెయిర్‌స్టో(15), సామ్ కర్రన్(6)లను ఔట్ చేసి పంజాబ్ శిబిరంలో కలకలం రేపాడు. దీంతో కింగ్స్ 52 ప‌రుగులకే 4 కీల‌క వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో జితేష్ శర్మ(29; 24 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్స్‌లు), లియామ్ లివింగ్‌స్టోన్(21; 14 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్), అశుతోష్ శర్మ(29; 16 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్స్‌లు) జట్టును ఆదుకున్నారు.

రాయల్స్ బౌలర్లలో కేశవ్ మహారాజ్, అవేష్ ఖాన్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.