కేసీఆర్ తో స్రవంతి భేటీ అయ్యారనే వార్తపై రేవంత్ ట్వీట్ 

కేసీఆర్ తో స్రవంతి భేటీ అయ్యారనే వార్తపై రేవంత్ ట్వీట్ 

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. పాల్వాయి స్రవంతి ఫొటోను మార్ఫింగ్ చేసి కేసీఆర్ తో భేటీ అయ్యారంటూ బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని, ఓటమి భయంతో ఇలా దిగజారారని మండిపడ్డారు. దుబ్బాక ఉప ఎన్నిక తరహాలోనే మునుగోడులోనూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 

సీఎం కేసీఆర్ ను కలిశానని తనపై వస్తున్న వార్తలపై పాల్వాయి స్రవంతి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాల్వాయి స్రవంతి ఈసీ అధికారులను కోరారు.