సీఎంను కలిసిన పీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్రెడ్డి

సీఎంను కలిసిన పీసీసీ జనరల్ సెక్రటరీ  గడ్డం చంద్రశేఖర్రెడ్డి

కామారెడ్డిటౌన్, వెలుగు : సీఎం రేవంత్​రెడ్డిని గురువారం హైదరాబాద్​లో కామారెడ్డి జిల్లాకు  చెందిన పీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్​రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్​పర్సన్ గడ్డం ఇందుప్రియ కలిశారు.  కొత్త ఏడాది సందర్భంగా సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.  రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని నాయకులకు సీఎం సూచించారు.