- పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
యాదాద్రి, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ కారణంగా తెలంగాణ రాష్ట్రం దివాళా తీసిందని పీసీపీ చీఫ్మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. యాదాద్రి జిల్లా ఆలేరు మండలం మందనపల్లిలో 'వీబీజీ రామ్ జీ' స్కీమ్ను తొలగించి ఉపాధి హామీ స్కీమ్ ను కొనసాగించాలని కోరుతూ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంపై వడ్డీతో కలుపుకొని రూ. 8 లక్షల కోట్ల అప్పుల భారం ఉందని దివాలా తీయించిన కేసీఆర్ ఇప్పుడు ఫామ్హౌజ్లో పడుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.
మున్సిపాలిటీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతానికి మించి టికెట్లు ఇస్తామని తెలిపారు. ఉపాధి హామీలో కేంద్రం నుంచి వందశాతం నిధులు వచ్చేదని, ఇప్పుడు అమల్లోకి వచ్చిన వీబీజీ రామ్జీతో రాష్ట్రంపై 40 శాతం భారం మోపిందని తెలిపారు. అసలే దివాళా తీసిన రాష్ట్రంపై ఈ భారం మరింత పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అధ్యక్షతన జరిగిన మీటింగ్లో ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, ఉన్నారు.
