గాంధీ భవన్ లో నియోజక వర్గాల వారీగా పార్లమెంట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. తొలి రోజు 25కు పైగా దరఖాస్తులు వచ్చాయని పార్టీ తెలిపింది. నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి, ఖమ్మం నుంచి వీహెచ్, నల్గొండ నుంచి పటేల్ రమేష్ రెడ్డి, వరంగల్ నుంచి ఇందిరా, మహబూబ్ బాద్ నుంచి బెల్లయ్య నాయక్ … ఇతరులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులకు ఇంకా రెండు రోజుల సమయం ఉంది.
