బీర్కూర్, వెలుగు : మండలంలోని కిష్టాపూర్ గ్రామంలోని ఓ రైస్ మిల్లులో పీడీఎస్ బియ్యం ఉన్నట్లు సమాచారం రావడంతో సోమవారం సాయంత్రం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి (ఏఎస్వో) స్వామి పరిశీలించారు. అనుమానం ఉన్న 32బస్తాల బియ్యాన్ని పరిశీలించారు.
అనంతరం ఆ బియ్యంలో నుంచి శాంపిళ్లను సేకరించి, వీటిని డీఎం ఆఫీస్కు పంపుతామన్నారు. మిల్లుకు ఆఫీసర్లు తాళం వేశారు. బియ్యం రిజల్ట్ వచ్చే వరకు మిల్లును మూసి ఉంచాలన్నారు. ఆర్ఐ విజయ్ కుమార్, జీపీవో సంతోష్, కాందార్లు తదితరులు ఉన్నారు.
