
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఏడాదిలోనే విజన్ఉన్న లీడర్గా నిరూపించుకున్నారని, పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి తనదైన శైలిలో కృషి చేశారని కాంగ్రెస్ లీడర్లు పేర్కొన్నారు. వంశీకృష్ణ ఎంపీగా గెలిచి ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలో బుధవారం వునుకొండ శ్రీధర్ పటేల్ ఆధ్వర్యంలో లీడర్లు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. పలువురు మాట్లాడుతూ వంశీకృష్ణ ఎంపీగా గెలిచిన వెంటనే ప్రజల్లో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటున్నాడని అన్నారు.
కరోనా టైంలో నిలిచిపోయిన రైళ్లను మంచిర్యాల, పెద్దపల్లి, రామగుండం, ఓదెల స్టేషన్లలో నిలిచేలా కృషి చేశారన్నారు. సింగరేణి, ఎన్టీపీసీ కార్మికుల సమస్యలపై పార్లమెంటులో మాట్లాడారని గుర్తు చేశారు. సింగరేణి రిటైర్డ్ కార్మికుల పింఛన్ రూ.వెయ్యికి పెంచేలా సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. లీడర్లు సయ్యద్ సజ్జద్, భూమయ్య, శ్రీనివాస్, రాజేశం, ఫయాజ్, రవి, రాజేశ్, నాగరాజ్, దేవేందర్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.
‘ఖని’లో కాంగ్రెస్ సంబురాలు
గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్ప్రాంత అభివృద్దికి ఎంపీ వంశీకృష్ణ ఎనలేని కృషి చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ లీడర్ పి.మల్లికార్జున్ తెలిపారు. ఎంపీగా ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా గోదావరిఖనిలో కాంగ్రెస్ లీడర్కామ విజయ్ ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో పటాకులు కాల్చి, అనంతరం పేదలకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న వంశీకృష్ణకు పార్లమెంట్ ప్రజల పక్షాన ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. కార్యక్రమంలో లీడర్లు కోటేశ్వర్లు, మల్లేశ్యాదవ్, తిప్పారపు మధు, హకీం, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.