పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పెద్దంపేట పంచాయతీ ఎన్నిక నిలిపివేయాలని శుక్రవారం హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈనెల11న ఎన్నిక జరగాల్సి ఉంది. పెద్దంపేట పంచాయతీ చెందిన చింతపట్ల సుహాసిని సర్పంచ్అభ్యర్థిగా నామినేషన్వేశారు. స్క్రూటినీలో అభ్యర్థి పేరు ఓటరు లిస్టు లేకపోవడంతో నామినేషన్రిజక్ట్ చేశారు.
కానీ, ఆన్లైన్ఓటర్లిస్టులో ఉంది. నామినేషన్ తిరస్కరణపై కలెక్టర్దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. దీంతో అభ్యర్థి సుహాసిని హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన స్వీకరించిన హైకోర్టు పెద్దంపేట పంచాయతీ ఎన్నికను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల15 కు వాయిదా వేసింది.
