
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్ను రూ.6 వేలకు పెంచాలని ఏంఆర్పీఎస్, వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ ఆఫీస్లను ముట్టడించారు. జన్నారంలో ఏంఆర్పీఎస్ మండల ప్రెసిడెంట్ కొండుకూరి ప్రభుదాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నా పెన్షన్లు పెంచలేదని, ఇప్పటికైనా ఇచ్చిన హమీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటి తహసీల్దార్ రామ్మోహన్కు వినతి పత్రం అందజేశారు. ఎమ్మార్పీఎస్ నేతలు కుంటాలలో తహసీల్దార్ కమల్ సింగ్కు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.