కులం, మతం పేరుతో ఓట్లేసి ప్రజలు విసిగిపోయారు

కులం, మతం పేరుతో ఓట్లేసి ప్రజలు విసిగిపోయారు
  • ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్

రాయ్ పూర్:  కులం, మతం పేరుతో ఓట్లు వేసి ఛత్తీస్ గఢ్ ప్రజలు విసిగిపోయారని ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ అన్నారు. కులం, మతం పేరుతో ఓట్లేస్తే ఏమీ రాదని వారు గుర్తించారని ఆయన పేర్కొన్నారు. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అన్ని వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందన్నారు. అందుకే కాంగ్రెస్ పట్ల జనంలో ఆదరణ పెరుగుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం ఖాయమని భూపేష్ బాఘెల్ ధీమా వ్యక్తం చేశారు.