రూ.2.5 కోట్లతో యూరప్​లో శాశ్వత నివాసం

రూ.2.5 కోట్లతో యూరప్​లో శాశ్వత నివాసం

హైదరాబాద్​, వెలుగు: తమ ప్లాట్​ఫారమ్​ ద్వారా రూ.2.5 కోట్ల పెట్టుబడితో యూరప్​లో శాశ్వత నివాసం (పర్మినెంట్​ రెసిడెన్సీ) హోదాను పొందవచ్చని  లెప్టోస్ ఎస్టేట్స్​ తెలిపింది. ప్రస్తుతం రూ.2.5 కోట్ల ఇన్వెస్ట్​మెంట్​ చాలని, ఆగస్టు 31 నుంచి ఇది రెట్టింపు అవుతుందని తెలిపింది. తమ ద్వారా గ్రీస్​లో మెడిటేరియన్ హోమ్​లో పెట్టుబడి పెట్టి ఈ సదుపాయం పొందవచ్చని పేర్కొంది. శాశ్వత నివాసంతో ఉచిత విద్య, వైద్యంతోపాటు దేశంలో వ్యాపారాన్ని నిర్వహించుకునే అవకాశం దక్కించుకోవచ్చు.  ప్రస్తుతం  ప్రారంభ పెట్టుబడి 2,50,000 యూరోలు కాగా, ఆగస్టు నుంచి 4,00,000 యూరోలకు పెరుగుతుందని అంచనా.