జైపూర్: ప్రేమ ఎంత పనైనా చేయిస్తుందని రాజస్థాన్కు చెందిన ఓ టీచర్ నిరూపించింది. స్టూడెంట్తో ప్రేమలో పడిన పీఈటీ టీచర్.. ఆమెను పెళ్లాడడానికి ఆపరేషన్ చేయించుకుని అబ్బాయిగా మారిపోయింది. భరత్పూర్కు చెందిన మీరా స్థానికంగా ఓ స్కూల్లో పీఈటీ టీచర్గా పనిచేస్తోంది. ఈమెకు కల్పనా ఫౌజ్దార్తో పరిచయం ఏర్పడింది. కల్పన, స్టేట్ లెవల్ కబడ్డీ ప్లేయర్ కావడంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. ఇద్దరూ పెండ్లి చేసుకోవాలనుకున్నారు. దీని కోసం మీరా అబ్బాయిగా మారేందుకు రెడీ అయ్యింది.
ఆరవ్ కుంతల్గా పేరు మార్చుకుని.. 2019లో ఫస్ట్ సెక్స్ రీ అసైన్మెంట్ సర్జరీ(ఎస్ఆర్ఎస్) చేసుకుంది. ఆ టైంలో హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు పడింది. తర్వాత ఇద్దరి కుటుంబాలు ఓకే చెప్పడంతో పెండ్లి చేసుకున్నారు. ‘‘లవ్లో ప్రతీది అందంగానే కనిపిస్తుంది. స్కూల్ ప్లే గ్రౌండ్లో కల్పన పరిచయమైంది. చూడగానే నచ్చేసింది. ఎలాగైనా పెండ్లి చేసుకోవాలనుకున్నా. నేను అమ్మాయిగా పుట్టినా.. అబ్బాయిలాగే పెరిగా. ఆలోచనలు కూడా అలాగే ఉండేవి. అందుకే జెండర్ మార్చుకున్నా. కల్పన కోసం 2019లో ఫస్ట్ ఆపరేషన్ చేసుకున్నా”అని ఆరవ్ కుంతల్ చెప్పాడు. ‘‘నాకు మొదటి నుంచి మీరా అంటే ఎంతో ఇష్టం. సర్జరీ చేయించుకోకపోయినా ఆమెనే పెండ్లి చేసుకునేదాన్ని. సర్జరీ టైంలో మీరాతో నేను కూడా వెళ్లాను’’అని కల్పన చెప్పింది. ఇంటర్నేషనల్ కబడ్డీ టోర్నీ కోసం జనవరిలో ఆరవ్తో కలిసి దుబాయ్కు వెళ్తున్నట్టు కల్పన చెప్పింది.