కేసీఆర్ డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ పై ఫోన్ ట్యాపింగ్

కేసీఆర్ డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ పై ఫోన్ ట్యాపింగ్

ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తు న్నాయి. తప్పులను ప్రశ్నించే ప్రతిపక్షాలపై, ప్రజాసంఘాలపై సీఎం హోదాలో నాడు కేసీఆర్​ వేసిన స్కెచ్​లు, ప్లాన్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఫోన్​ ట్యాపింగ్​ కేసులో అరెస్టయిన టాస్క్​ఫోర్స్​ మాజీ డీసీపీ రాధాకిషన్​రావు విచారణలో ఈ వివరాలన్నీ వెల్లడయ్యాయి.  వీటిని రాధాకిషన్​రావు కస్టడీ రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు. 

అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులపై కేసీఆర్ ​డైరెక్షన్​లో ఫోన్​ ట్యాపింగ్​ నడిచిందని రాధాకిషన్​రావు వెల్లడించాడు. బీజేపీ నేతలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్​, ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎన్​టీవీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నరేంద్రనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌదరి, ఏబీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపైనా గత సర్కార్​ ఫోన్​ ట్యాపింగ్​ను ప్రయోగించిందన్నాడు. ప్రభుత్వంలోని తప్పులను ప్రశ్నించినందుకు 2021 ఆగస్టులో తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయించింది. కేసీఆర్​ ఆదేశాల మేరకే  తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్టు రాధాకిషన్ రావు స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. 

ఇదంతా నాటి ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, ప్రణీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు ఆధ్వర్యంలోనే చేసినట్లు వెల్లడించాడు. కాంగ్రెస్​ సీనియర్​ నేత జానారెడ్డి కొడుకు రఘువీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, సరిత తిరుపతయ్య, జువ్వాడి నర్సింగరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్లను కూడా ట్యాప్​ చేశారు. ఫోన్లు ట్యాప్​ అవుతున్నాయని తెలిసి కొందరు స్నాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చాట్​లో మాట్లాడితే.. ఆ కాల్స్​ కూడా ట్యాప్​ చేసినట్టు తెలింది. ఎలక్షన్స్​ టైమ్​లో ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి చెందిన డబ్బును రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుష్ప సంస్థ నుంచి తరలించామని, ఇలా అధికార పార్టీకి చెందిన డబ్బును ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ చేసేందుకు పోలీస్ వెహికల్స్ వాడినట్టు కూడా రాధాకిషన్​రావు వెల్లడించాడు. 

నాడు దుబ్బాక, హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బై ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు మునుగోడు బై ఎలక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అత్యంత సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీసుకున్నారు. ఎలాగైనా బీజేపీ గెలుపును అడ్డుకోవాలని పథకం పన్నారు. ఈ క్రమంలోనే  2022 అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొంతమంది బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు గుర్తించి.. పైలట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి నుంచి సమాచారం సేకరించారు. ఇందులో భాగంగా నాటి ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐబీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభాకర్ రావుతో కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పలుమార్లు మీటింగ్స్​ జరిపారు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చివరి వారంలో నాటి టాస్క్​ఫోర్స్​ డీసీపీ రాధాకిషన్ రావుతో ప్రభాకర్ రావు భేటీ అయ్యారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బీజేపీ నేతలను ట్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని రాధాకిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుకు ప్రభాకర్​రావు సూచించారు. ఇందుకు తగ్గట్టుగా నాటి ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐబీ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓటీ చీఫ్ ప్రణీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  నిఘా పెట్టింది.

 బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యేలు, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యక్తులను ఆ టీమ్​ పూర్తిగా తమ సర్వెలైన్స్​లోకి తీసుకుంది. ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా ఆడియో క్లిప్ సేకరించింది. ఆ ఆడియో క్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరవేసింది. ఆ తర్వాత నాటి ఎమ్మెల్యే పైలెట్​ రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పటిష్టంగా ట్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయాలని సూచించారు. ఇందులో భాగంగా నందుకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రామచంద్ర భారతి, సింహయాజీతో రోహిత్​రెడ్డి పలుమార్లు మాట్లాడారు. వీరి సంభాషణలు అన్నీ రికార్డ్ చేశారు. ఇదే క్రమంలో మొయినాబాద్ అజీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ట్రాపింగ్​కు కేంద్రంగా ఎంచుకున్నారు.