
కాలర్గీ: దాదాపు దశాబ్దకాలం తర్వాత ప్రధామంత్రి మోదీ కెనడాకు వెళ్లారు. ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు జీ7 సమిట్లో పాల్గొనేందుకు ఆయన సోమవారం సాయంత్రం కాలర్గీ సిటీకి చేరుకున్నారు. కననాస్కిస్లో జరిగే ఈ సమిట్లో ఆయన గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతలను ప్రస్తావించనున్నారు.
అలాగే పలు దేశాధినేతలతోనూ మాట్లాడతారు. ఇంధన భద్రత, టెక్నాలజీ, ఇన్నొవేషన్స్ గురించి వారితో చర్చించనున్నట్లు ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. అనంతరం మోదీ అక్కడి నుంచి క్రొయేషియా వెళ్లనున్నారు.