కరోనా దెబ్బకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలు హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని సూచించారు. హోలీ వేడుకల వల్ల కూడా కరోనా వ్యాపించే ప్రమాదముందని ఆయన అన్నారు. జనం గుంపులుగా ఉండే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని మోడీ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు… ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలను అందరూ పాటించాలని మోడీ ట్వీట్ చేశారు. తాను ఈ సారి హోలీ వేడుకల్లో పాల్గొనడం లేదని ప్రధాని మోడీ క్లారిటీ ఇచ్చారు. కరోనా వైరస్ విస్తరిస్తునందువల్ల మాస్ గ్యాదరింగ్స్ను వీలైనంత వరకు తగ్గించుకోవాలని మోడీ సూచించారు.
For More News..