గాజా శాంతి సమావేశానికి..ప్రధాని మోదీకి ఆహ్వానం.. ట్రంప్ కూడా వస్తున్నారు

గాజా శాంతి సమావేశానికి..ప్రధాని మోదీకి ఆహ్వానం.. ట్రంప్ కూడా వస్తున్నారు

గాజా శాంతి శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీకి ఆహ్వనం అందింది. ఈజిప్టులోని షర్మ్​ ఎల్​ షేక్​ లో జరగనున్న గాజా శాంతి సదస్సుకు హాజరు కావాలని ఈజీప్టు అధ్యక్షుడు అడ్టేల్​ ఫత్తా ఎల్​ సిసి అధికారిక ఆహ్వానం పంపారు. అయితే ఈ సమావేశానికి స్వయంగా మోదీ హాజరయ్యే కనిపించడం లేదు. భారత్​ తరపున ఆయనకు బదులుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి కీర్తీ వర్దన్​ సింగ్​ ను ఈ సమావేశానికి హాజరు కానున్నారు. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, ఈజిప్టు అధ్యక్షుడు ఎల్​ సీసీ సంయుక్తంగా అధ్యక్షత వహించే ఈ సమావేశానికి  ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెర్రెస్​, యూకె ప్రధాని కీర్ స్టార్మర్​, ఇటాలియన్​ ప్రధాని జార్జియా మెలోనీ, స్పానిష్​ ప్రధాని పెడ్రో సాంచెజ్​, ఫ్రెంచ్​అధ్యక్షుడు ఇమ్మానియేల్​ మాక్రాన్​సహా 20 దేశాల నాయకులు హాజరుకానున్నారు. 

ఈజిప్లులో గాజా శాంతి సమావేశం.. 

గాజాలో యుద్దాన్ని ముగింపుకు ఒప్పందాన్ని చేసేందుకు ఈజిప్టు సోమవారం ( అక్టోబర్​ 13) ఎర్ర సముద్రంలోని రిసార్ట్​ నగరమైన షర్మ్​ ఎల్​ షేర్​ లో అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఈజిప్టు అధ్యక్షుడు తెలిపారు.  

అయితే ఈ సమావేశంలో  యుద్ధాన్ని అధికారికంగా ఎలా ముగించగలదో అస్పష్ట ఉండటంతో హమాస్ ఇకపై గాజా పాలనలో ఎటువంటి ముప్పును కలిగించదని, దాని నుండి ఎటువంటి ప్రమాదం లేదని సంతృప్తి చెందే వరకు యుద్ధాన్ని ముగించడానికి అంగీకరించబోమని ఇజ్రాయెల్ తెలిపింది.

హమాస్​ హాజరవుతుందా?

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన ప్రణాళికతో కొన్ని విభేదాల కారణంగా ఈజిప్టులో గాజా శాంతి ఒప్పందంపై అధికారిక సంతకం కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ ప్రకటించింది.