
న్యూఢిల్లీ: ప్రతి మంత్రీ టైమ్ను తప్పనిసరిగా పాటించాలని, సకాలంలో ఆఫీసులకు చేరుకోవాలని ప్రధాని మోడీ హితవుపలికారు. ఇంటి నుంచి పనిచేసే కల్చర్కు స్వస్తి పలకాలని, రెగ్యులర్గా ఆఫీసుకొచ్చి పనిచేయడానికే శ్రద్ధ చూపాలని, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు సూచనలు చేశారు. సహాయ మంత్రుల సేవలను వాడుకోవాలని, ముఖ్యమైన విధుల్లోనూ, కీలకమైన ఫైళ్ల పరిష్కారంలోనూ భాగస్వామ్యం కల్పించాలని చెప్పారు. మినిస్టర్స్, వారి జూనియర్స్ కలిసి కూర్చొని ఫైల్స్ను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలన్నారు. ‘‘ఆఫీస్కొచ్చాక కనీసం ఐదు నిమిషాలు శాఖ పరిధిలోని లేటెస్ట్ డెవలప్మెంట్స్పై అధికారులతో చర్చించుకోవాలి” అన్నారు. మంత్రులకు, ఎంపీలకు తేడాలు లేవని, మంత్రులు కూడా ఎంపీలనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి మంత్రి వారి శాఖల పరిధిలో పక్కా ప్రణాళికను రూపొందించుకోవాలని, ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై కూడా మంత్రులకు ఆయన పలు సూచనలు చేసినట్లు సమాచారం.