ఒలింపిక్స్లో ‘టార్చ్ రిలే’ ఈవెంట్వెరీవెరీ స్పెషల్. ఇదే తరహా ఈవెంట్ ను తొలిసారిగా చెస్ ఒలింపియాడ్ కోసం ఆదివారం నిర్వహించారు. ఈ ప్రత్యేక ఘట్టానికి న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియం వేదికగా నిలిచింది. చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలేను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ (ఫిడే) అధ్యక్షుడు అర్కాడీ వోర్కోవిచ్ టార్చ్ ను ప్రధాని మోడీకి అందజేశారు. అనంతరం ప్రధాని మోడీ దాన్ని చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కు ఇచ్చారు.
प्रधानमंत्री @narendramodi ने #ChessOlympiad की ऐतिहासिक मशाल रिले की शुरुआत की; फिडे अध्यक्ष ने पीएम को मशाल सौंपी; पीएम मोदी ने @vishy64theking को सौंपी मशाल । #OlympiadFlame #India4ChessOlympiad pic.twitter.com/oFSWiLVQSf
— Office of Mr. Anurag Thakur (@Anurag_Office) June 19, 2022
ఈ టార్చ్ మన దేశంలోని అన్ని రాష్ట్రాల పరిధిలో ఉన్న 75 పట్టణాలు తిరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో అక్కడి చెస్ గ్రాండ్ మాస్టర్లు టార్చ్ ను అందుకుంటారు. చివరగా .. జూలై 28 నుంచి 44వ చెస్ ఒలింపియాడ్ కు ఆతిథ్యమివ్వనున్న తమిళనాడులోని మహాబలిపురానికి టార్చ్ చేరుకుంటుంది. ఆగస్టు 10 వరకు ఈ పోటీలు జరుగుతాయి. ఓపెన్, మహిళల విభాగాల్లో 11 రౌండ్లలో చెస్ పోటీలు జరుగుతాయి. 187 దేశాలకు చెందిన దాదాపు 2వేల మందికిపైగా ప్లేయర్లు ఇందులో పాల్గొంటారు. కాగా, టార్చ్ రిలే ప్రారంభ కార్యక్రమంలో చెస్ చాంపియన్లు విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి కూడా పాల్గొన్నారు.