కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని మోడీ

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని మోడీ

ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నారు. ఆయనకు భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకా ఇచ్చారు. పుదుచ్చేరికి చెందిన నర్సు నివేద… మోడీకి వ్యాక్సిన్ వేశారు. కరోనా నియంత్రణకు డాక్టర్లు, సైంటిస్టులు చేసిన కృషిని ప్రధాని అభినందించారు. అర్హులైన వారందరు వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. కరోనా రహిత భారత్ గా మార్చేందుకు కృషి చేయాలన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కన్సెంట్ ఫామ్ పై సంతకం చేశారు మోడీ. ఇంజక్షన్ చేసిన తర్వాత… తన గురించి మోడీ అడిగారని నివేద చెప్పారు.