రాష్ట్ర స్థాయి పోటీల్లో లింగంపేట విద్యార్థుల ప్రతిభ

రాష్ట్ర స్థాయి పోటీల్లో లింగంపేట విద్యార్థుల ప్రతిభ

లింగంపేట, వెలుగు: కరీంనగర్​లోని పారమిత హైస్కూల్​లో మూడు రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్​ సంబరాల్లో  పీఎంశ్రీ జడ్పీ బాయ్స్​ హైస్కూల్​ విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు  ఆదివారం ఎంఈవో షౌకత్​అలీ తెలిపారు. 

పాఠశాలకు చెందిన పోతరాజు, ప్రతి గౌడ్, భానుప్రసాద్ రాష్ట్ర స్థాయి క్విజ్​పోటీల్లో రెండో స్థానంలో  నిలిచారని చెప్పారు. ఓవరాల్​ కాంపిటీషన్స్​లో రాష్ట్ర స్థాయిలో 5వ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. సాయంత్రం ప్రతిభ కనబరిచిన స్కూల్​ విద్యార్థులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో టీచర్లు వహిద్​సిద్దిఖీ, తదితరులు పాల్గొన్నారు.