
హైదరాబాద్, వెలుగు: పీఎన్బీ మెట్లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, పాలసీబజార్తో కలిసి పెన్షన్ కన్జంప్షన్ ఫండ్ను పరిచయం చేసింది. ఈక్విటీ-ఆధారిత వృద్ధి ద్వారా దీర్ఘకాలిక రిటైర్మెంట్ ప్లానింగ్ను ఇది లక్ష్యంగా చేసుకుంది. న్యూ ఫండ్ ఆఫర్ఈ నెల 16న మొదలయింది. ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్ఎఫ్ఓ విండో సమయంలో యూనిట్ధర రూ. 10 ఉంటుంది. యూనిట్లన అక్టోబర్ 31న కేటాయిస్తారు.
ఇది రిటైర్మెంట్-ఆధారిత పెట్టుబడి ఆప్షన్ ఫండ్. కన్జూమర్ట్రెండ్స్ నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉన్న కంపెనీలలో పెట్టుబడి పెడుతుంది. పెరుగుతున్న ఆదాయాలు, పట్టణీకరణ, డిజిటల్ వినియోగం వంటి అంశాలపై ఫోకస్చేస్తుంది. ఇది పీఎన్బీ మెట్లైఫ్ స్మార్ట్ ఇన్వెస్ట్ పెన్షన్ ప్లాన్, స్మార్ట్ ఇన్వెస్ట్ పెన్షన్ ప్లాన్ ప్రో ద్వారా అందుబాటులో ఉంటుంది.