Success Story: రచయిత్రి శాలినీకి ఐజీఎఫ్ ఆర్చర్ అవార్డ్

Success Story: రచయిత్రి శాలినీకి  ఐజీఎఫ్ ఆర్చర్ అవార్డ్

భారతీయ రచయిత్రి డాక్టర్ శాలిని మాలిక్ ది వే హోమ్ పేరిట తాను రాసిన నవలకుగాను బ్రిటన్ సాంస్కృతిక మంత్రి లీసా నాన్జీ చేతుల మీదుగా తొలి ఐజీఎఫ్ ఆర్చర్ అమీశ్ అవార్డు అందుకున్నారు. ఈ నెల 18న లండన్​లో అవార్డును అందజేశారు. రచయిత్రి డాక్టర్ శాలినికి ఈ అవార్డు కింద రూ.21.70 లక్షల(25,000 డాలర్లు) నగదు లభించింది. 

రచయిత్రి శాలిని శ్వాస కోశ వ్యాధుల నిపుణురాలు. ఈ అవార్డును ప్రముఖ రచయితలైన లార్డ్ జెఫ్రీ ఆర్చర్, అమీశ్ త్రిపాఠిల పేరు మీదుగా ఏర్పాటు చేశారు. గోవాలో ఆశ్రయం పొందుతున్న ముగ్గురు వ్యక్తుల అంతర్గత సంఘర్షణకు అద్దం పట్టే ఈ నవలను అత్యుత్తమ రచనగా ఎంపిక చేశారు.