
దేశ రాజధాని ఢిల్లీలో స్పెషల్ సెల్ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. జహంగీర్పురి నుండి జనవరి 12న ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు పట్టుకున్నారు. ఉగ్రవాదులను నౌషాద్ , జగ్జిత్లుగా గుర్తించారు. వారి వద్ద నుండి 2 మిలిటరీ గ్రేడ్ హ్యాండ్ గ్రెనేడ్లు, 3 పిస్టల్స్, కాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులకు పాకిస్థాన్తో సంబంధాలు ఉన్నట్లుగా అదనపు సీపీ పి కుష్వాహ ప్రకటించారు.