శోభయాత్ర ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడంటే

శోభయాత్ర ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడంటే

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: శ్రీరామ నవమి శోభాయాత్రకు పోలీసులు సిటీలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర కొనసాగే రూట్​లో బుధవారం ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయని సిటీ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శోభాయాత్ర సీతారాంబాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రామాలయం నుంచి మొదలై బోయిగూడ కమాన్, మంగళ్ హాట్, జాలీ హనుమాన్, దూల్ పేట, పురాణపూల్, గాంధీ విగ్రహం, జుమ్మేరాత్ బజార్, చుడీ బజార్, బేగంబజార్ ఛత్రీ, సిద్ది అంబర్ బజార్, గౌలిగూడ, గురుద్వార్, పుత్లీబౌలి క్రాస్ రోడ్స్, సుల్తాన్ బజార్ మీదుగా హనుమాన్ వ్యాయామశాలకు చేరుకోనుంది. ఈ రూట్​లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. వాహదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సీపీ సూచించారు.

ట్రాఫిక్ డైవర్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండే ప్రాంతాలు

ఆసిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ నుంచి సీతారాంబాగ్​ వైపు వచ్చే వెహికల్స్​మల్లేపల్లి క్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్స్ నుంచి విజయనగర్ కాలనీ, మెహిదీపట్నం వైపు వెళ్లాలి. 

బోయిగూడ కమాన్ నుంచి సీతారాంబాగ్ వైపు వచ్చే వాహనాలను ఆఘాపురా, హబీబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ వైపు 

మళ్లిస్తారు. 

ఆఘాపురా, హబీబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ నుంచి సీతారాంబాగ్ వైపు వచ్చే ట్రాఫిక్​ను దారుస్సలాం వద్ద డెవర్ట్ ​చేస్తారు.

బోయిగూడ కమాన్ నుంచి పురానాపుల్ వెళ్లే వాహనాలను దారుస్సలాం వద్ద మళ్లిస్తారు.

పురానాపూల్ నుంచి గాంధీ విగ్రహం వైపు వచ్చే వాహనాలను పేట్లబురుజు, కార్వాన్, కుల్సుంపురా వైపు డెవర్ట్​చేస్తారు.

ఎంజే బ్రిడ్జి వైపు నుంచి వచ్చే వాహనాలను జుమ్మేరాత్ బజార్ వైపు, సిటీ కాలేజీ, అఫ్జల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గంజ్ వైపు మళ్లిస్తారు.

మాలకుంట నుంచి ఎంజే బ్రిడ్జి వైపు వచ్చే వాహనాలను అలస్క నుంచి దారుస్సలాం వైపు డెవర్ట్​చేస్తారు.

 అఫ్జల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గంజ్ నుంచి సిద్ధిఅంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బజార్ రూట్ లో వచ్చే వాహనాలను సాలార్​జంగ్ బ్రిడ్జి వద్ద మళ్లిస్తారు.

రంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మహల్, కోఠి నుంచి గౌలిగూడ చమాన్ వైపు వెళ్లే వాహనాలను జాంబాగ్, ఎంజే మార్కెట్ వద్ద డెవర్ట్​చేస్తారు.

అఫ్జల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గంజ్ నుంచి ఎంజే బ్రిడ్జి వైపు వచ్చే వాహనాలను మదీనా, సిటీకాలేజీ వైపు మళ్లిస్తారు.

అఫ్జల్ గంజ్ నుంచి కోఠి వచ్చే వాహనాలను సెంట్రల్ లైబ్రరీ,సాలార్జంగ్​మ్యూజియం వైపు 

మళ్లిస్తారు.

 రంగ్ మహల్ నుంచి వచ్చే ట్రాఫిక్ ను సీబీఎస్ వైపు మళ్లించారు.

 రంగ్ మహల్, ఆంధ్రా బ్యాంక్ నుంచి వచ్చే ట్రాఫిక్ ను జాంబాగ్ వైపు డైవర్ట్​చేస్తారు.

 బ్యాంక్ స్ట్రీట్ నుంచి పుత్లీబౌలి వైపు వెహికల్స్​కు అనుమతి ఉండదు. ర్యాలీ ముగిసే వరకు డీఎంహెచ్ఎస్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.

 చాదర్ ఘాట్ బ్రిడ్జి, సాయి బాబా టెంపుల్ నుంచి వచ్చే ట్రాఫిక్ ను నింబోలి అడ్డా వైపు మళ్లిస్తారు.

 నారాయణగూడ, కాచిగూడ నుంచి వచ్చే వాహనాలను కాచిగూడ స్టేషన్ రోడ్ మీదుగా మళ్లిస్తారు.

 చర్మాస్ నుంచి వచ్చే వాహనాలను ఎంజే మార్కెట్, నాంపల్లి స్టేషన్ రోడ్ లోకి డెవర్ట్ ​చేస్తారు.

 అబిడ్స్ జీపీఓ నుంచి బ్యాంక్ స్ట్రీట్ వైపు అనుమతి ఉండదు.

 తిలక్ రోడ్ నుంచి వచ్చే ట్రాఫిక్​ను రాంకోటి వైపు మళ్లిస్తారు.