ఆ పోస్ట్‌ నేను పెట్టలే.. నేను రాయలే

ఆ పోస్ట్‌ నేను పెట్టలే.. నేను రాయలే
  • రతన్‌ టాటా క్లారిటీ

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో పాటు మన దేశంలో ఫేక్‌ న్యూస్‌ కూడా వేగంగానే వ్యాప్తి చెందుతోంది. కాగా.. ప్రముఖ వ్యాపార వేత్త రతన్‌ టాటా కూడా ఆ ఫేక్‌న్యూస్‌ బారిన పడ్డారు. ఎకానమీ గురించి తాను చెప్పినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఒక పేపర్‌‌ క్లిప్పింగ్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. “ ఆ పోస్ట్‌ నేను చెప్పలేదు.. నేను రాయలేదు కూడా. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో సర్క్యూలేట్‌ అవుతున్న వార్తలు నిజమా కాదా అని తెలుసుకోండి. ఏమైనా చెప్పాలనుకుంటే నేను స్వయంగా చెప్తాను” అని ఆయన ట్వీట్‌ చేశారు. కరోనా సంక్షోభం సమయంలో దేశ ఎకానమీపై రతన్‌ టాటా కామెంట్‌ చేశారు అంటూ ఒక వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో ఆయన దానిపై క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కరోనా బారిన పడకుండా జనాలంతా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.