నాగ్ అశ్విన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్

నాగ్ అశ్విన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్

ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ప్రభాస్ హీరోగా క్రేజే ప్రాజెక్ట్ రానుంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో  ‘మహానటి’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. నాగ్ అశ్విన్ వినిపించిన కథ బాగా నచ్చి, ఆయన దర్శకత్వంలో సినిమా చెయ్యడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇప్పటివరకూ చేయని తరహా పాత్రలో, ఒక కొత్త జానర్ లో ప్రభాస్ ను నాగ్ అశ్విన్ చూపించనున్నారు. తెలుగు చిత్రసీమలోని టాప్ ప్రొడక్షన్ కంపెనీల్లో ఒకటైన వైజయంతీ మూవీస్ ను సుప్రసిద్ధ నిర్మాత సి. అశ్వినీదత్ 49 ఏళ్ల క్రితం ప్రారంభించారు. ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలను, భారీ ప్రతిష్ఠాత్మక సినిమాలను అందించిన ఘనత ఆ బ్యానర్ సొంతం.

అలాంటి బ్యానర్ 50వ ఏట అడుగుపెడుతున్న సందర్భంలో ప్రేక్షకులకు ఒక మరపురాని సినిమాను అందించేందుకు సంకల్పించింది. 2018లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఆ సంస్థ నిర్మించిన ‘మహానటి’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా, మూడు జాతీయ అవార్డుల్ని సైతం పొంది దేశవ్యాప్తంగా కీర్తిని సంపాదించింది. ప్రభాస్, నాగ్ అశ్విన్ క్రేజీ కాంబినేషన్ మూవీని త్వరలోనే వైజయంతీ మూవీస్ సంస్థ ప్రారంభించనున్నది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.