హైదరాబాద్: డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదిపురుష్’. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది. మహాశివరాత్రి సందర్భంగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. 2023, జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కాగా, గతంలో ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ చెప్పారు. కానీ అనుకోని కారణాల రీత్యా ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయనున్నట్లు హీరో ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మరోవైపు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో జానకిగా కృతి సనన్ నటిస్తోంది. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ యాక్ట్ చేస్తున్న ‘ఆదిపురుష్’ను ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు.
#Adipurush Worldwide Theatrical Release in 3D on 12th Jan 2023.#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 @TSeries @retrophiles1 #ShivChanana #TSeries pic.twitter.com/lyBWPx1eci
— Prabhas (@PrabhasRaju) March 1, 2022
మరిన్ని వార్తల కోసం: