కంచె, నక్షత్రం లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న ప్రగ్యా జైస్వాల్.. ఈసారి ‘అఖండ’తో కలిసి ప్రేక్షకుల ముందుకొస్తోంది. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తీసిన ఈ మూవీ డిసెంబర్ 2న విడుదలవుతున్న సందర్భంగా ప్రగ్య చెప్పిన విశేషాలు.
‘‘నా కెరీర్ స్టార్టింగ్లో అవకాశాలొస్తే చాలనుకున్నా. తర్వాత మంచి రోల్స్ కోరుకున్నా. అందుకే బాలకృష్ణ గారితో మూవీ అనగానే చాలా సంతోషమేసింది. ఆయనకిది నూట ఆరో సినిమా. నేనేమో న్యూ కమర్ని. ఫస్ట్ డే షూట్లో చాలా నెర్వస్గా ఫీలయ్యాను. బాలయ్యగారు మాత్రం చాలా జోవియల్గా మాట్లాడి కంఫర్ట్బుల్గా చేశారు. ఆయనెప్పుడూ పాజిటివ్గా, ఎనర్జిటిక్గా ఉంటారు. రోజుకో కొత్త విషయం నేర్చుకున్నాను. ప్యాండమిక్ తర్వాత ఇదే నా మొదటి సినిమా. యాక్షన్, మాసివ్ ఫిల్మ్ కావడంతో షూటింగ్కి ఎక్కువ రోజులు పట్టింది. నేను డెబ్భై తొమ్మిది రోజులు షూట్లో పాల్గొన్నాను. నా పాత్ర పేరు శ్రావణ్య. ఐఏఎస్ ఆఫీసర్ని. డిఫరెంట్ రోల్. స్టోరీ అంతా నా క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. బోయపాటి ఫెంటాస్టిక్ డైరెక్టర్. అందుకే స్టూడెంట్లా ఆయన చెప్పింది చేసుకుంటూ పోయాను. ఈ సినిమాకి బాలకృష్ణ, బోయపాటి పిల్లర్స్. జగపతిబాబు క్యారెక్టర్ చూసి షాకయ్యా. ఫస్ట్ డే ఆయన్ని అసలు గుర్తు పట్టలేదు. బోయపాటి ప్రతి ఒక్కరినీ క్రేజీ గెటప్స్లో చూపిస్తారు. స్ర్కీన్స్పై చూసి అందరూ థ్రిల్ ఫీలవుతారు. పాటలు కూడా బ్యూటిఫుల్గా వచ్చాయి. ‘అడిగా అడిగా’ పాటలో నా లుక్కి కాంప్లిమెంట్స్ వచ్చాయి. మంచి మాస్ సాంగ్ కూడా ఉంది. మిగతా రెండూ స్టోరీ బేస్డ్గా వస్తాయి. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. త్వరలోనే అనౌన్స్ చేస్తాను.’’