ఇండోనేసియా ఓపెన్‌‌ సెమీస్లో ప్రణయ్ ఓటమి

 ఇండోనేసియా ఓపెన్‌‌  సెమీస్లో ప్రణయ్ ఓటమి

జకర్తా: ఇండియా స్టార్‌‌ షట్లర్‌‌ హెచ్‌‌.ఎస్‌‌. ప్రణయ్‌‌.. ఇండోనేసియా ఓపెన్‌‌లో  మరోసారి సెమీస్‌‌లోనే ఇంటిముఖం పట్టాడు. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌‌లో ప్రణయ్‌‌ 16–21, 15–21తో జున్‌‌ పెంగ్‌‌ (చైనా) చేతిలో ఓడాడు. 40 నిమిషాల మ్యాచ్‌‌లో ఇండియా ప్లేయర్‌‌ షటిల్‌‌పై కంట్రోల్‌‌ చూపెట్టలేకపోయాడు. షాట్స్‌‌లో రిథమ్‌‌ లేకపోవడం, ర్యాలీలు ఆడటంలో ఇబ్బంది పడిన ప్రణయ్‌‌  తొలి గేమ్‌‌లో 6–11తో వెనుకబడ్డాడు. ఈ దశలో అనవసర తప్పిదాలతోపాటు నెట్‌‌ వద్ద  తేలిపోయి తొలి గేమ్​ చేజార్చుకున్నాడు.  ఇక రెండో గేమ్‌‌లో 7–7 స్కోరు తర్వాత ప్రణయ్‌‌ పుంజుకోలేకపోయాడు. జున్​ పెంగ్​ స్పష్టమైన ఆధిక్యంతో గేమ్‌‌, మ్యాచ్‌‌ను ముగించాడు.