
సిడ్నీ: ఇండియా స్టార్ షట్లర్ హెచ్.ఎస్. ప్రణయ్.. ఆస్ట్రేలియన్ ఓపెన్లో రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన మెన్స్ సింగిల్స్ టైటిల్ ఫైట్లో ఆరోసీడ్ ప్రణయ్ 9–21, 23–21, 20–22తో వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడాడు. మే నెలలో జరిగిన మలేసియా ఓపెన్లో యాంగ్ను ఓడించిన ప్రణయ్ ఈసారి కూడా అదే విజయాన్ని రిపీట్ చేస్తాడని భావించారు. కానీ మూడో గేమ్లో ప్రత్యర్థి కొట్టిన క్రాస్ కోర్టు ర్యాలీస్ను తీయలేకపోయాడు.
90 నిమిషాల మ్యాచ్లో ఇద్దరు షట్లర్లు ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా పోరాడారు. తొలి గేమ్లో ప్రణయ్ అనవసర తప్పిదాలతో ఇబ్బందిపడ్డాడు. జంప్ షాట్లతో ఓ దశలో స్కోరు సమం చేసినా యాంగ్ వరుసగా 12 పాయింట్లు నెగ్గి ఈజీగా గేమ్ గెలిచాడు. రెండో గేమ్లో ప్రణయ్ ఎక్కువగా రిస్క్ షాట్లు ఆడాడు. దీనికి యాంగ్ కూడా దీటుగానే బదులిచ్చాడు. ఫలితంగా స్కోరు 19–19, 20–20, 21–21తో స్కోరు సమమైంది.
ఈ దశలో యాంగ్ కొట్టిన ఫోర్హ్యాండ్ షాట్ వైడ్గా వెళ్లడం, ఆ వెంటనే ప్రణయ్ గేమ్ పాయింట్ను కాపాడుకుని మ్యాచ్లో నిలిచాడు. ఇక డిసైడర్లోనూ ప్రణయ్ జోరే కొనసాగింది. ఓ దశలో 17–14తో ముందంజ వేశాడు. కానీ యాంగ్ 71 షాట్ల ర్యాలీస్తో వరుసగా మూడు పాయింట్లు నెగ్గాడు. దీంతో స్కోరు 17–17, 19–19తో సమమైంది. సరిగ్గా గేమ్ గెలిచే ప్రయత్నంలో ప్రణయ్ కొట్టిన రెండు స్మాష్లు నెట్కు తాకడంతో కోలుకోలేకపోయాడు. ఆ వెంటనే యాంగ్ నెట్ వద్ద సూపర్ డ్రాప్తో మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు.