సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన : కలెక్టర్ ప్రతీక్ జైన్

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన : కలెక్టర్  ప్రతీక్  జైన్

కోస్గి, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 24న కోస్గి పర్యటించనుండగా, శనివారం వికారాబాద్  కలెక్టర్  ప్రతీక్  జైన్, నారాయణపేట ఇన్ చార్జి కలెక్టర్  సంచిత్  గంగ్వార్, కాడా స్పెషల్​ ఆఫీసర్​ వెంకట్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. పట్టణంలోని ఓ ఫంక్షన్​ హాల్​లో కొడంగల్  నియోజకవర్గంలోని 8 మండలాల కొత్త సర్పంచులను సీఎం సన్మానించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని  కలెక్టర్లు ఆదేశించారు. 

మధ్యాహ్నం 2 గంటలకు సీఎం హెలికాప్టర్ లో కోస్గి చేరుకుంటారని తెలిపారు. సీఎంతో పాటు కార్యక్రమంలో పాల్గొనే  మంత్రులు, ఎమ్మెల్యేలు, వీఐపీలకు అన్ని సౌలతులు కల్పించాలని సూచించారు. అడిషనల్​ కలెక్టర్  శ్రీను, ఆర్డీవో రాంచందర్  నాయక్, వికారాబాద్  ట్రైనీ కలెక్టర్  హర్ష్​ చౌదరి, ఎస్డీసీ రాజేందర్ గౌడ్, డీఆర్డీవో మొగులప్ప, డీఎంహెచ్​వో జయచంద్రమోహన్, డీఏవో జాన్  సుధాకర్, పీఆర్  ఈఈ హీర్యా నాయక్  పాల్గొన్నారు.