
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రశంసలు
డయ్యూ : డయ్యూలో కల్చరల్ హెరిటేజ్ను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు, స్వచ్ఛత కోసం స్థానిక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రశంసించారు. డయ్యూలో పర్య టిస్తున్న ప్రెసిడెంట్ శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ కోవింద్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రాంతం చరిత్రలో ధైర్య సాహసాలు, దేశభక్తి కథలు ఎన్నో కనిపిస్తయి. ఐఎన్ఎస్ ఖుక్రి కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ మహేంద్రనాథ్ ముల్లా సాహసం మరువలేనిది. 1971 ఇండోపాక్ వార్లో యుద్ధనౌక మునిగిపోతుంటే తోటి అధికారులు, సిబ్బందిని కాపాడి ఆయన ప్రాణాలు విడిచారు. ఎలా బతకాలో, ఎలా చావాలో కూడా ఆయన నుంచి నేర్చుకోవచ్చు’ అని అన్నారు. డామన్ డయ్యు యూనియన్ టెర్రిటరీలో మూడు జిల్లాలను ఓపెన్ డెఫకేషన్ ఫ్రీగా ప్రకటించారని ప్రశంసించారు.
For More News..
కరోనా వైరస్లో నెలకు రెండు మార్పులు
పార్టీ మారిన ఎంపీ.. కారును అడ్డుకున్న కార్యకర్తలు
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న డాక్టర్కు అలర్జీ