జీ20 అతిథులకు రాష్ట్రపతి విందు.. 170 మంది అతిథులు..

జీ20 అతిథులకు రాష్ట్రపతి విందు.. 170 మంది అతిథులు..

జీ20 సమావేశాల (G20 Summit 2023) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతిథులకు విందు ఏర్పాటు చేశారు.  దేశవిదేశాల నుంచి అతిరథ మహారథులు ఈ డిన్నర్‌కు హాజరవుతున్నారు. శనివారం (సెప్టెంబర్ 09న) రాత్రి దిల్లీలోని భారత్‌ మండపం అనే ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు ఈ విందులో  మొత్తం170 మంది అతిథు లను ఆహ్వానించారు. వివిధ దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షులు, ప్రతినిధులు, ప్రధాన మంత్రి, మాజీ ప్రధానులు, కేబినెట్‌ మంత్రులు, సహాయ మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపారు. 

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్‌, ఆయన సతీమణి సుదేశ్‌ ధన్‌కడ్‌, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ విందుకు హాజరవుతారు. ఈ విందుకు రాజకీయ నాయకులను ఆహ్వానించలేదు.

ALSO READ : న్యూఢిల్లీ డిక్లరేషన్ కు గ్రీన్ సిగ్నల్..

ఈ విందులో కేంద్ర మంత్రులు రాజనాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌, నరేంద్ర సింగ్‌ తోమర్‌, ఎస్‌ జైశంకర్‌, అర్జున్‌ ముండా, స్మృతి ఇరానీ, పియూష్ గోయెల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, ప్రహ్లాద్‌ జోషీ హాజరయ్యారు. 

కేంద్ర మంత్రులు నారాయణ రాణె, సర్బానంద సోనోవాల్‌, వీరేంద్ర కుమార్ పరాస్‌, గిరిరాజ్‌ సింగ్‌, జ్యోతిరాధిత్య సింధియా, అశ్విని వైష్ణవ్‌, పషుపతి కుమార్‌ పరాస్‌, గజేంద్ర సింగ్‌ షెకావత్‌, కిరణ్‌ రిజిజు, రాజ్‌కుమార్‌ సింగ్‌, హర్‌దీప్‌ సింగ్‌ పూరి, మన్‌సుక్‌ మాండవీయ, భూపేంద్ర యాదవ్‌, మహేంద్ర నాథ్‌ పాండే, పురుషోత్తమ్‌ రూపాలా, జి కిషన్‌ రెడ్డి, అనురాగ్‌ ఠాకూర్‌ ఆహ్వానితుల జాబితాలో  ఉన్నారు.

కాగ్‌ అధినేత గిరీశ్‌ చంద్ర ముర్ము, లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా, ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ దోవత్‌, దిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా, జీ20 షర్ఫా అమితాబ్‌ కాంత్‌ ముఖ్య అతిథులు వస్తున్నారు. మాజీ ప్రధానులు మన్మోహన్‌ సింగ్‌, దేవే గౌడకు ఆహ్వానాలు అందాయి. అనారోగ్య కారణాలతో విందుకు రావడం లేదని దేవెగౌడ ప్రకటించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ విందుకు ఆహ్వానించారు.