రచయితలు, ఉపాధ్యాయుల వల్లే సమాజం విజ్ఞానాన్ని పొందుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. స్కూలు జీవితం ముగిసినా…. పుస్తకాలు మనలో జ్ఞానాన్ని పెంపొందిస్తాయన్నారు. జైపూర్ లోని పత్రికా గేట్ ను ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ప్రధాని. రాజస్థాన్ లోని ప్రముఖ న్యూస్ పేపర్ అయిన పత్రికా సంస్థ పేరు మీద దీన్ని ఏర్పాటు చేశారు. అలాగే పత్రికా గ్రూప్ ఛైర్మన్ రాసిన రెండు పుస్తకాలను రిలీజ్ చేశారు ప్రధాని. కార్యక్రమంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా పాల్గొన్నారు.
Launching of Patrika Gate at a programme in Jaipur. https://t.co/d64CB2iJXE
— Narendra Modi (@narendramodi) September 8, 2020