
చెస్టర్ లీ స్ట్రీట్: టీమిండియాకు దూరమైన పృథ్వీ షా (76 బాల్స్లో 15 ఫోర్లు, 7 సిక్స్లతో 125 నాటౌట్).. ఇంగ్లండ్ కౌంటీ వన్డే కప్లో మరోసారి సెంచరీతో చెలరేగాడు. దీంతో ఆదివారం డర్హమ్తో జరిగిన మ్యాచ్లో నార్తంప్టన్షైర్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన డర్హమ్ 43.2 ఓవర్లలో 198 రన్స్ చేసింది. లియామ్ ట్రెవాస్కి (37), అలెక్స్ లీస్ (34), జొనాథన్ బుష్నెల్ (32) రాణించారు. లూక్ ప్రోక్టెర్ 4, జేమ్స్ సేల్స్, రాబ్ కియోగ్ చెరో రెండు వికెట్లు తీశారు. టార్గెట్ ఛేజింగ్లో నార్తంప్టన్షైర్ 25.4 ఓవర్లలో 204/4 స్కోరు చేసి నెగ్గింది. షాకు తోడుగా రాబ్ కియోగ్ (42) చెలరేగాడు. జార్జ్ డ్రసెల్ 3 వికెట్లు పడగొట్టాడు.