మోడీ అహంకారమే..అతడిని ఓడిస్తుంది : ప్రియాంక గాంధీ

మోడీ అహంకారమే..అతడిని ఓడిస్తుంది : ప్రియాంక గాంధీ

అంబాలా : ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీపై సీరయస్ అయ్యారు కాంగ్రెస్ చీఫ్ సెక్రటరీ ప్రియాంక గాంధీ.  మంగళవారం హర్యానాలోని అంబాలాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంకాగాంధీ..మోడీని దుర్యోధనుడితో పోల్చారు. మోడీ దుర్యోధనుడిలా దురహంకారి అని, ఆయన అహంకారమే ఈ ఎన్నికల్లో ఓటమికి కారణమవుతుందన్నారు. బీజేపీ నాయకులు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు గురించి ఎక్కడా మాట్లాడటం లేదని మండిపడ్డారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై మోడీ చేసిన వ్యాఖ్యలను ప్రియాంకాగాంధీ తిప్పికొట్టారు. మోడీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.