ప్రజారోగ్య సేవలు మరింత మెరుగుపరచాలి :  కలెక్టర్  పమేలా సత్పతి

ప్రజారోగ్య సేవలు మరింత మెరుగుపరచాలి :  కలెక్టర్  పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజారోగ్య సేవలను మరింత మెరుగుపరచాలని కలెక్టర్  పమేలా సత్పతి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో ప్రభుత్వ జనరల్  ఆసుపత్రి, సీహెచ్​సీలు, పీహెచ్​సీ డాక్టర్లతో రివ్యూ మీటింగ్  నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమకూర్చిన అధునాతన పరికరాలను వినియోగించి రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు.

గైనకాలజీ, పిల్లల వైద్యులు, మెడికల్  ఆఫీసర్లు సమన్వయంతో గర్భిణులు, శిశువులకు సేవలు అందించాలన్నారు. పీహెచ్​సీల్లో  ప్రసవాల సంఖ్య పెంచాలని, నార్మల్  డెలివరీలకు  ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇన్ఫెక్షన్  కంట్రోల్  కమిటీలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అత్యవసరమైన పరికరాలను కొనుగోలు చేయాలని సూచించారు. డీఎంహెచ్ వో వెంకటరమణ, ప్రోగ్రాం ఆఫీసర్  డాక్టర్​ సనా, జీజీహెచ్  ఆర్ఎంవో నవీన పాల్గొన్నారు.