న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తనయుడు రైహాన్ రాజీవ్ గురించి తెలుసా? వైల్డ్ లైఫ్లోని టైగర్ ఫొటోను తీసిన రాజీవ్ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. రాజస్థాన్, రంథంబోర్లోని ఓ పులి ఫొటోను రాజీవ్ తీసి తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశాడు. పొదల్లో ఉన్న పులి ఓర కంటితో చూస్తున్నట్లుగా ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం నెట్లో చక్కర్లు కొడుతోంది. బ్యూటిఫుల్ షాట్, అమేజింగ్ ఫొటో, సూపర్ క్లిక్, చాలా ధైర్యం చేశావంటూ నెటిజన్స్ రాజీవ్ను మెచ్చుకుంటున్నారు.
Eye Spy
T-101, Zone – 6, Ranthambore National Park, 06/10/20. pic.twitter.com/nQ5g2RV9Wp
— Raihan Rajiv Vadra (@raihanrvadra) October 7, 2020