సస్పెన్స్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా కాలింగ్ సహస్ర

సస్పెన్స్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా కాలింగ్ సహస్ర

సుడిగాలి సుధీర్ హీరోగా అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాలింగ్ సహస్ర’. డాలీషా హీరోయిన్‌‌‌‌. విజేష్ త‌‌‌‌యాల్‌‌‌‌, చిరంజీవి ప‌‌‌‌మిడి, వెంక‌‌‌‌టేశ్వర్లు కాటూరి నిర్మించారు. డిసెంబ‌‌‌‌ర్ 1న సినిమా విడుదల కానుంది. మంగళవారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. నిర్మాత బెక్కం వేణుగోపాల్ అతిథిగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. 

హీరో సుధీర్ మాట్లాడుతూ ‘‘గాలోడు’తో మాస్ ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు సస్పెన్స్‌‌‌‌ థ్రిల్లర్ జానర్‌‌‌‌‌‌‌‌లో రాబోతున్నా. కొత్తగా ప్రయత్నిస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆశిస్తున్నా’ అన్నాడు. సుధీర్‌‌‌‌‌‌‌‌తో కలిసి నటించడం ఆనందంగా ఉందని చెప్పింది డాలీషా. ‘ఇప్పటి వరకు ఇలాంటి కథతో ఇండియన్ స్క్రీన్‌‌‌‌ మీద సినిమా రాలేదు. 

టీమ్ అందరి సపోర్ట్‌‌‌‌ వల్లే సినిమా బాగా వచ్చింది’ అని దర్శకుడు అరుణ్ అన్నాడు. నిర్మాత విజేష్ త‌‌‌‌యాల్‌‌‌‌, సంగీత దర్శకులు మార్క్ కె రాబిన్, మోహిత్, కెమెరామెన్ శశికిరణ్, నటుడు రవితేజ నన్నిమాల తదితరులు పాల్గొన్నారు.