తలసానిపై భగ్గుమన్న గిరిజనులు.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్

తలసానిపై భగ్గుమన్న గిరిజనులు.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీరును నిరసిస్తూ.. నిర్మల్ జిల్లా బైంసాలో గిరిజనులు ఆందోళన చేపట్టారు. బస్టాండ్ ముందు బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు వర్గం నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో, ధర్నా చేపట్టారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ గిరిజనులను అవమానించారని ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి తలసాని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబుపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేయి చేసుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ వర్గానికి అవమానం జరిగిందంటూ గిరిజన నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.