
- రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణరెడ్డి
రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: ప్రజలు అందించే వినతులపై తక్షణం స్పందించాలని రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం రంగారెడ్డి కలెక్టరేట్లో ప్రజావాణిలో నిర్వహించగా, ఆయన అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 48 ఫిర్యాదులు వచ్చాయి.
వికారాబాద్లో 56 అర్జీలు..
వికారాబాద్: వికారాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 56 అర్జీలు వచ్చాయి. వాటిని కలెక్టర్ ప్రతీక్ జైన్ స్వీకరించి పరిశీలించారు.
హైడ్రాకు 48..
హైదరాబాద్ సిటీ: హైడ్రా కార్యాలయంలో గ్రీవెన్స్కు 48 ఫిర్యాదులు అందాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వాటిని పరిశీలించారు. లేఅవుట్లలో పార్కు స్థలాలు, వరద నీటి కాలువలు, శ్మశాన వాటికల కబ్జాలపై ఎక్కువగా కంప్లయింట్స్ వచ్చాయి.