గాయత్రి–ట్రీసా జోడీ శుభారంభం

గాయత్రి–ట్రీసా జోడీ శుభారంభం

సిడ్నీ: కామన్వెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రాంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఇండియా డబుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షట్లర్లు పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ ఆస్ట్రేలియా ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 500 బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 17వ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాయత్రి–ట్రీసా జంట 21–16, 21–17తో 29వ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేథరిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చోయి–జోసెఫైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వు (కెనడా) ద్వయాన్ని ఓడించి రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరుకుంది. 

మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జంట 12–21, 21–14, 17–21తో ఫెబ్రియానా కుసుమ–అమేలియా ప్రతివి (ఇండోనేసియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. సిక్కిరెడ్డి–ఆరతి జంట 14–21, 17–21తో తైవాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన సు యిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–లీ చిహ్ చెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓడింది.