అమరుల త్యాగాలను గుర్తుగా.. చీరలపై జవాన్ల ఫ్రింట్

అమరుల త్యాగాలను గుర్తుగా.. చీరలపై జవాన్ల ఫ్రింట్

పుల్వామా దాడిలో అమరుల కుటుంబాలను ఆదుకునేందుకు ఓ టెక్స్ టైల్ సంస్థ వినూత్నంగా ఆలోచించింది. అమరుల త్యాగాలను గుర్తు చేసేలా చీరలను ప్రింట్ చేసింది. వీటిని అమ్మడం ద్వారా వచ్చే డబ్బులను అమరుల కుటుంబాలకు అందిస్తామని చెప్పింది. గుజరాత్ లోని సూరత్ కు చెందిన.. అన్నపూర్ణ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అమరులకు తమ వంతు సాయంగా ఈ విధంగా చేస్తోంది.