పంజాబ్లోని జలంధర్ జిల్లాలో అక్టోబర్ 8న రాత్రి ఓ ఇంట్లో రిఫ్రిజిరేటర్లోని కంప్రెసర్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పేలుడు ధాటికి ఇంట్లో భారీగా మంటలు చెలరేగాయి. మృతులను యశ్పాల్ ఘై (70), రుచి ఘై (40), మన్షా (14), దియా (12), అక్షయ్ (10)గా గుర్తించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ఈ పేలుడుకు ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి, నమూనాలను సేకరించడానికి ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని పిలిచినట్లు అధికారులు తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోందని వారు వెల్లడించారు.