ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ కూతురు వాణిదేవి నామినేషన్

ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ కూతురు వాణిదేవి నామినేషన్

హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ తరపున టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కూతురు సురభి వాణిదేవి నామినేషన్ వేశారు అంతకు ముందు క్యాంప్ ఆఫీసులో సురభి వాణిదేవికి బీ ఫాం ఇచ్చారు సీఎం కేసీఆర్. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు ఆమెను పరిచయం చేశారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున పూర్తిస్థాయిలో బాధ్యతలు తీసుకొని గెలుపు కోసం పనిచేయాలని నేతలకు సూచించారు. అభ్యర్థి అన్ని నియోజక వర్గాలు తిరిగే అవకాశం లేదన్నారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై అన్ని పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు.