పీవీ సేవలు మర్చిపోయిన కాంగ్రెస్ పార్టీ: ఎమ్మెల్సీ కవిత

పీవీ సేవలు మర్చిపోయిన కాంగ్రెస్ పార్టీ: ఎమ్మెల్సీ కవిత

పీవీ నరసింహారావు సేవలు కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిందని ఎమ్మెల్సీ విమర్శించారు. దేశానికి మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు చేసిన సేవలను మరచి పోవడమే కాకుండా మరిపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని ధ్వజమెత్తారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను సమూలం గా మార్చి గాడిలో పెట్టిన మహోన్నత వ్యక్తి పీవీ అని కొనియాడారు. 

2023 ఆగస్టు 07 సోమవారం నిజామాబాద్ జిల్లాలోని బోర్గాం (పి )చౌరస్తా వద్ద భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత, పీవీ నరసింహారావు కొడుకు పీవీ ప్రభాకర్ రావు, కూతురు ఎమ్మెల్సీ సురభి వాణి, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘ సభ్యులు వేదమం త్రాలతో పూర్ణకుంభంతో అతిథులకు పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. 

కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్యాల వల్ల దేశ ఆర్థిక పరిస్థితి కుధేలైన సందర్భంలో పీవీ నరసింహా రావు ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఆ పరిస్థితుల్లో ఉన్న బంగారం కుదవపెట్టి అన్నమోరామచంద్ర అనుకుంటున్న క్లిష్టసమయంలో ప్రధాని అయిన పీవీ కేవలం తన మేధో సంపత్తితో ఆలోచన చేసి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని ఆమె చెప్పారు. ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా నియమించుకొని కొత్త ప్రయోగాలకు పూనుకున్నారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుళజాతి కంపెనీల నుంచి పెట్టుబడులు ఆకర్శించేందుకు ధైర్యంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. కానీ అటుంవటి విషయన్ని కూడా మరిచి పోయి మరిపించే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందని ఆరోపిం చారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిడ్డను గుర్తించకపోతే సీఎం కేసీఆర్ పట్టుదలతో శతజయంతి ఉత్సవాలను నిర్వహించారని చెప్పారు.